News November 7, 2024

హోంమంత్రి అనిత వార్నింగ్

image

AP: భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఘటనలోనైనా 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వంలో పోలీసులు తలెత్తుకునేలా, నేరస్థుడు భయపడేలా చేస్తామని చెప్పారు.

Similar News

News January 10, 2026

ఎట్టకేలకు పూర్తిగా తగ్గిన బ్లోఅవుట్ మంటలు

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద ఎట్టకేలకు మంటలు తగ్గిపోయాయి. ఈ నెల 5న గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను ఆర్పేందుకు ONGC సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. 5 రోజుల తర్వాత పూర్తిగా తగ్గాయి. దీంతో వెల్ క్యాపింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 10, 2026

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

image

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.

News January 10, 2026

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

image

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.