News January 28, 2025
సూర్యాపేటలో పరువు హత్య కలకలం?

TG: సూర్యాపేటలో ఓ యువకుడి పరువు హత్య కలకలం రేపుతోంది. అన్నారానికి చెందిన మాల బంటి (32), పిల్లలమర్రికి చెందిన నవీన్ ప్రాణ స్నేహితులు. నవీన్ చెల్లెలు భార్గవితో బంటికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 6 నెలల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. నిన్న బంటి హత్యకు గురయ్యాడు. నవీన్, కుటుంబ సభ్యులే హత్య చేశారని బంటి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు, నిందితులు కలిసి రియల్ ఎస్టేట్ చేసేవారు.
Similar News
News February 14, 2025
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: CM చంద్రబాబు

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>>ని CM చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.
News February 14, 2025
YCP మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు

AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 14, 2025
వివాదాస్పద కామెంట్స్.. సుప్రీంకు యూట్యూబర్

పేరెంట్స్ సెక్స్పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.