News April 11, 2024

రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్

image

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా చరణ్ పాల్గొననున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

అనుపమ ఫొటోలు మార్ఫింగ్.. చేసింది ఎవరో తెలిసి షాకైన హీరోయిన్

image

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయే ఆ పని చేస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్‌డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ చెప్పారు.

News November 9, 2025

ఈ వైరస్‌తో బెండ పంటకు తీవ్ర నష్టం

image

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.

News November 9, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* తాడిపత్రిలో బాలిక యశస్వి భారతి(9) 6ని.ల 9సెకన్లలో 100 ట్యూబ్‌లైట్లను తలపై పగలగొట్టించుకుంది. వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం ఈ సాహసం చేసింది.
* ఒకప్పుడు గిరిజన గ్రామాలంటే డోలీ మోతలని, ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా మారాయని మంత్రి సంధ్యారాణి చెప్పారు.