News December 28, 2024

ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య

image

AP: వైఎస్సార్(D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 20, 2025

కాళేశ్వరం విచారణ.. నేడు KCRకు నోటీసులు?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ CM కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌(మాజీ ఆర్థిక మంత్రి)ను విచారణకు పిలిచే అవకాశముంది. ఇవాళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది.

News January 20, 2025

విశ్వవిజేతలుగా భారత్: తెలుగోడి కీలక పాత్ర

image

ఖో ఖో WCలో భారత మహిళల జట్టు విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ పాత్ర ఉంది. TGలోని పెద్దపల్లి(D) ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్‌గా మారారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాగా అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. స్కిల్ అనలైజర్‌గా ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో ఆయనదే ముఖ్య పాత్ర.

News January 20, 2025

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.