News January 27, 2025
ఘోరం: శానిటరీ ప్యాడ్ అడిగిన బాలికను..

శానిటరీ ప్యాడ్ అడిగిన 11వ తరగతి బాలిక పట్ల ప్రిన్సిపల్ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన UP బరేలీలో జరిగింది. ఎగ్జామ్ రాస్తుండగా విద్యార్థినికి పీరియడ్స్ మొదలయ్యాయి. బ్లీడింగ్ కావడంతో దిక్కుతోచని ఆమె శానిటరీ ప్యాడ్ ఇవ్వాలని ప్రిన్సిపల్ను అడిగింది. వెంటనే ఏర్పాటుచేయాల్సిన ఆయన బాలికను అవమానిస్తూ గంటపాటు బయట నిలబెట్టాడు. ఈ ఘటనపై ఆమె తండ్రి ఫిర్యాదుతో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 8, 2025
సంచలన వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ సీఎం అవుతారు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఓటమితో డీలా పడ్డ కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత సీఎం భగవంత్ మాన్ను కేజ్రీవాల్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. పంజాబ్కు హిందూ వ్యక్తి సీఎం అవుతారని రాష్ట్ర AAP అధ్యక్షుడు అమన్ అరోరా కూడా ఇటీవల అన్నారు’ అని బజ్వా గుర్తుచేశారు.
News February 8, 2025
సమంతతో విడాకులు.. ఆ విషయంలో బాధపడ్డా: నాగచైతన్య

సమంతతో తాను విడాకులు తీసుకోవడానికి శోభిత ధూళిపాళ్ల కారణమని జరిగిన ప్రచారంపై నాగచైతన్య స్పందించారు. ‘ఇది చూసి నేను చాలా బాధపడ్డా. ఆమెకు ఈ చెడ్డపేరు రావాల్సింది కాదు. విడాకులకు శోభిత కారణమే కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్లా చాలా సాధారణంగా, అందంగా వచ్చింది. మా మధ్య తొలుత స్నేహం, ఆ తర్వాత రిలేషన్షిప్ మొదలైంది’ అని స్పష్టం చేశారు. కాగా 2021లో సమంతతో విడిపోయిన చైతూ 2024లో శోభితను వివాహమాడారు.
News February 8, 2025
కరుణ్ నాయర్ మరో సెంచరీ

డొమెస్టిక్ క్రికెట్లో విదర్భ ప్లేయర్ <<15137627>>కరుణ్ నాయర్<<>> వీరవిహారం చేస్తున్నారు. రంజీ క్వార్టర్ ఫైనల్-2లో భాగంగా తమిళనాడుతో మ్యాచులో ఆయన మరో సెంచరీ బాదారు. 180 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. కాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ కరుణ్ 5 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఆయన టీమ్ ఇండియాకు సెలక్ట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్కు BCCI ఎంపిక చేయలేదు.