News November 29, 2024
ఘోరం: కదులుతున్న అంబులెన్స్లో బాలికపై గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్లోని మౌగాంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలిక(16)ను కిడ్నాప్ చేసి కదులుతున్న ప్రభుత్వ అంబులెన్స్లో ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ఈ నెల 25న ఈ ఘటన జరగగా బాలిక ఫిర్యాదుతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. నిందితులైన అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతని స్నేహితుడు రాజేశ్ కేతవ్లను పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News February 9, 2026
గేమింగ్ స్కామ్.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

హైదరాబాద్లో ఆన్లైన్ గేమింగ్ స్కామ్ను DGGI అధికారులు బయటపెట్టారు. ఫిన్టెక్ పేరుతో ₹5వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. పలు వెబ్సైట్లతో అక్రమ దందా చేశారని, GST ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఓషనీక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీలకు రెంటెడ్ ఖాతాలతో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, మాస్టర్మైండ్ దుబాయ్లో ఉన్నాడని సమాచారం.
News February 9, 2026
కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.
News February 9, 2026
రింకూ సింగ్ పెళ్లి మరోసారి వాయిదా

ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ MP ప్రియా సరోజ్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. T20 WC, IPL నేపథ్యంలో ముహూర్తం జూన్కు మార్చినట్లు రింకూ సోదరుడు సోనూ వెల్లడించారు. కాశీలో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్ 8న వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. తొలుత పెళ్లికి నవంబర్లో డేట్ ఫిక్స్ చేశారు.


