News January 4, 2025
త్వరగా రూ.2,250 కోట్ల బకాయిలను చెల్లించాలి: ఆస్పత్రుల సంఘం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735981841310_695-normal-WIFI.webp)
ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిలపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.2,250 కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఆరోగ్యమంత్రి, అధికారులను కలవగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Similar News
News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737505262608_81-normal-WIFI.webp)
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
News January 22, 2025
ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737503043066_81-normal-WIFI.webp)
తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 22, 2025
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737502815690_782-normal-WIFI.webp)
UPలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.