News December 4, 2024
అమరావతిలో త్వరలోనే ఇంటి నిర్మాణం: CBN

AP: అమరావతిలో నివాస <<14784465>>గృహానికి<<>> భూమి కొనుగోలు చేసినట్లు, త్వరలో ఇంటి నిర్మాణం ప్రారంభిస్తామని CM చంద్రబాబు తెలిపారు. అటు, కాకినాడ పోర్టు విషయంలో జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించిన నీచ చరిత్ర జగన్ది అని, అన్నింటిపైనా విచారిస్తామని మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన షిప్లో ఇవాళ కూడా అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Similar News
News February 18, 2026
పాక్తో వివాదం.. ఇండియా నుంచి తరలిపోనున్న ICC ఈవెంట్లు?

పాక్తో వివాదాల ఎఫెక్ట్ ఇండియాలో జరగాల్సిన ICC టోర్నీలపై పడినట్లు తెలుస్తోంది. 2029 CT, 2031 ODI WC బాధ్యతలు ఇంకో దేశానికి అప్పగించాలని ICC భావిస్తున్నట్లు The Age తెలిపింది. ఈ రేసులో AUS ముందున్నట్లు చెప్పింది. ఇండియాలో టోర్నీలు నిర్వహిస్తే బంగ్లా, పాక్తో మళ్లీ <<19058725>>గొడవలు<<>> ఏర్పడొచ్చని ICC ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. T20 WC నుంచి బంగ్లా వైదొలగగా, పాక్ బాయ్కాట్ డ్రామాలాడటం తెలిసిందే.
News February 18, 2026
మార్కుల్లో తేడా వస్తే టీచర్కు ఫైన్!

AP: పదో తరగతి మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్లో 5 కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్కు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఫైన్ విధించనుంది. ఒక పేపర్ను తప్పకుండా 12 నిమిషాలు దిద్దాలనే నిబంధన పకడ్బందీగా అమలు చేయనుంది. గతేడాది వ్యాల్యూయేషన్లో భారీగా తప్పులు దొర్లడం, ఓ స్టూడెంట్కు ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం పెద్ద వివాదమైంది.
News February 18, 2026
ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా?

చర్మ ఆరోగ్యం కోసం ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిదే కానీ వాటిని తరచూ వాడితే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్తరకం ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ముఖం శుభ్రం చేసుకోకుండా ఫేస్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.


