News March 3, 2025
బీచ్లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు ఎలా ఇస్తారంటే?

బీచ్లో నీటి నాణ్యత, పర్యావరణ విధానాలు, భద్రతలో మంచి ప్రమాణాలు పాటిస్తేనే బ్లూఫ్లాగ్ గుర్తింపు వస్తుంది. మలినాలు, రసాయనాలు బీచ్లో కలవకూడదు. PH ప్రమాణాలు బాగుండాలి. CC కెమెరాలు, డ్రైనేజ్, వ్యర్థాల నిర్వహణ, టాయిలెట్స్, సెక్యూరిటీ వంటి 33రకాల సౌకర్యాలు ఉండాలి. INDలో 12 బీచ్లకే ఈ గుర్తింపు ఉండగా, <<15632535>>రుషికొండ <<>>ఒకటి. డెన్మార్క్లోని ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ ట్యాగ్ ఇస్తుంది.
Similar News
News March 23, 2025
అమెరికాలో కాల్పులు.. భారత్కు చెందిన తండ్రి, కూతురు మృతి

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో గుజరాత్కు చెందిన ప్రదీప్(56), ఆయన కుమార్తె ఊర్మి(26) మృతిచెందారు. వీరు వర్జీనియాలో డిపార్ట్మెంటల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. నిందితుడు ఉదయాన్నే ఆ షాపు వద్దకు వచ్చి గొడవకు దిగారు. రాత్రి నుంచి మద్యం కోసం వేచి ఉంటే షాపు ఎందుకు మూసేశారని గన్తో కాల్పులకు దిగాడు. ప్రదీప్ అక్కడికక్కడే చనిపోగా, ఊర్మి ఆస్పత్రిలో మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News March 23, 2025
జూన్లో సూర్య-అట్లూరి మూవీ షురూ?

వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య నటించనున్న సినిమా జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ప్రీప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని టాక్. ఈ చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే లేదా కయాదు లోహర్ను తీసుకునే అవకాశం ఉంది. ఈ మూవీని నాగవంశీ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.
News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.