News December 29, 2024
క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారంటే..!
ప్రస్తుతం రుణం కావాలంటే ఏ సంస్థ అయినా క్రెడిట్ స్కోరు చూస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇది తప్పనిసరి. క్రెడిట్ స్కోర్ను కొన్ని ఆర్బీఐ అనుమతి పొందిన ఆర్థిక సంస్థలు నిర్వహిస్తుంటాయి. తొలుత ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ప్రకారం లెక్కిస్తారు. అలాగే రేషియో క్రెడిట్ స్కోర్ ఆధారంగా దీనిని నిర్వహిస్తారు. మీ పాత బ్యాంకులు, క్రెడిట్ కార్డుల హిస్టరీ ఆధారంగానూ లెక్కిస్తారు.
Similar News
News January 19, 2025
నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా..
AP: గతేడాది తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రకటించారు. తాజాగా నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) రూ.70 లక్షల విలువైన రెండు పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబులో అమర్చారు. వీటితో నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించవచ్చు.
News January 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
News January 19, 2025
100 మందిలో ఒకరికి క్యాన్సర్!
AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.