News May 10, 2024

TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు?: హైకోర్టు

image

AP: ఎన్నికల నిర్వహణపై ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా ప్రమాణాలు ఎందుకని ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ‘TGలో రైతు భరోసాకు ఎలా అనుమతిచ్చారు? APలో పథకాలను ఏవిధంగా అడ్డుకుంటున్నారు? 2019లో పసుపు-కుంకుమకు అనుమతి ఇచ్చినప్పుడు అనుసరించిన నియమాలను ఇప్పుడు పాటించడం లేదని స్పష్టమవుతోంది’ అని పేర్కొంది. నిధుల విడుదలకు ఇక సమయం లేనందున ఎన్నికల తర్వాతే జమ చేయాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2025

పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి

image

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News February 12, 2025

బూతులతో రెచ్చిపోయిన నటుడు పృథ్వీ

image

హైబీపీతో బాధపడుతూ HYDలోని ఓ <<15429041>>ఆస్పత్రిలో చేరిన<<>> నటుడు పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. ‘11 అనే మాట వస్తే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారు. సినిమాను సినిమాగా చూడండి. నా తల్లిని నీచంగా మాట్లాడుతున్నారు కదరా’ అంటూ రాయడానికి వీలులేని తీవ్ర అసభ్య పదజాలంతో దుయ్యబట్టారు. కాగా ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

News February 11, 2025

PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

image

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

error: Content is protected !!