News December 4, 2024

పెళ్లి చూపుల్లోనే ఎంత మంది పిల్లలు కావాలన్నారు: మిథాలీ రాజ్

image

పెళ్లి చూపుల్లో తనకు ఎదురైన ఇబ్బందికర అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడే పెళ్లిచూపులకు సిద్ధమయ్యా. పరిచయాలు అయిపోగానే నాతో మాట్లాడేవారు. పెళ్లయ్యాక క్రికెట్ వదిలేయాలని, ఎంత మంది పిల్లలు కావాలని, అత్తగారికి సేవలు చేయాలని అడిగేవారు. ఎవరో ఓ వ్యక్తి కోసం అన్నీ వదులుకోవడం నా వల్ల కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..

image

2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

News January 16, 2025

నితీశ్‌కు లోకేశ్ అభినందనలు

image

AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.

News January 16, 2025

ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం

image

వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.