News March 7, 2025
దేశంపై ఎన్ని రూ.కోట్ల అప్పు ఉందంటే?

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతూ వస్తున్నాం. అయితే, అభివృద్ధితో పాటు దేశంపై అప్పు కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాపై రూ.181 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు బడ్జెట్లో కేంద్రం తెలిపింది. ఇది వచ్చే ఏడాది వరకు రూ.196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కాగా, తెలంగాణపై రూ.5లక్షల కోట్లు, ఏపీపై రూ.9 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 8, 2025
గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.
News November 8, 2025
పెసర, మినుము పంటల్లో విత్తనశుద్ధికి సూచనలు

పెసర, మినుములో చీడపీడల నివారణకు విత్తనశుద్ధి కీలకం. అందుకే విత్తడానికి ముందు ఒక కిలో విత్తనానికి 3గ్రా. మ్యాంకోజెబ్ మందుతో విత్తనశుద్ధి చేసి తర్వాత 5 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేసి విత్తితే తొలిదశలో ఆశించే రసంపీల్చే పురుగులు, తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. చివరగా విత్తే ముందు ఎకరానికి 200గ్రా. రైజోబియం కల్చర్ను 10 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
News November 8, 2025
నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


