News February 8, 2025
ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.
Similar News
News February 7, 2026
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి శాయ శక్తుల కృషి: CM

నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తన శాయ శక్తుల కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకు ఎయిర్పోర్టు తెస్తామని స్పష్టం చేశారు. బర్దిపూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. DS, సంతోష్ రెడ్డి, అర్గుల రాజారాం లాంటి మహానాయకులతో పాటు 69 ఉద్యమంలో తన బంగారాన్ని విరాళంగా ఇచ్చిన సదా లక్ష్మీలాంటి వారు జిల్లా వాసులని గుర్తు చేశారు.
News February 7, 2026
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి శాయ శక్తుల కృషి: CM

నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తన శాయ శక్తుల కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాకు ఎయిర్పోర్టు తెస్తామని స్పష్టం చేశారు. బర్దిపూర్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. DS, సంతోష్ రెడ్డి, అర్గుల రాజారాం లాంటి మహానాయకులతో పాటు 69 ఉద్యమంలో తన బంగారాన్ని విరాళంగా ఇచ్చిన సదా లక్ష్మీలాంటి వారు జిల్లా వాసులని గుర్తు చేశారు.
News February 7, 2026
పార్వతీపురం: ఉగాది లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండుగ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల్లో సంబంధిత మండలాల్లో పెండింగ్లో ఉన్న 1500 ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.


