News April 25, 2024
మూడో దశ ఎన్నికల బరిలో ఎంతమంది అంటే?

మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 1,351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ పేర్కొంది. కాగా ఈ స్థానాలకు మే 7న ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి 95 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నిన్న గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
రవితేజ సినిమాలో సమంత?

రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సమంత హీరోయిన్గా నటించే ఛాన్సుందని తెలిపాయి. గతంలో శివ దర్శకత్వంలో మజిలీ, ఖుషి సినిమాల్లో సామ్ నటించారు. దీంతో మరోసారి ఆమెను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నారు.
News November 17, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.1,24,970కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పతనమై రూ.1,14,550 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,73,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 17, 2025
బాలకృష్ణకు క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్

‘ఎమోజీ’ వివాదం ముదరడంతో హీరో బాలకృష్ణకు TG హోంశాఖ స్పెషల్ CS సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పారు. 2 నెలల కిందట పైరసీ, బెట్టింగ్ యాప్ల విషయంపై టాలీవుడ్ ప్రముఖులతో ఆనంద్ సమావేశం నిర్వహించి Xలో ఓ పోస్టు చేశారు. అయితే ఈ భేటీకి బాలయ్యను ఎందుకు పిలవలేదని ఓ వ్యక్తి ప్రశ్నించగా, ఆనంద్ X ఖాతాను హ్యాండిల్ చేసే వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన పోస్టును తొలగించి సారీ చెప్పారు.


