News January 21, 2025

నీరజ్ చోప్రాకు కట్నం ఎంత ఇచ్చారంటే..?

image

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఇటీవల టెన్నిస్ ప్లేయర్ హిమానీ మోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కట్నంగా తన అత్తమామల నుంచి నీరజ్ ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. అలాగే ఎలాంటి ఖరీదైన బహుమతులు, వస్తువులు, దుస్తులు కూడా ఆయన స్వీకరించలేదని హిమానీ తల్లిదండ్రులు తెలిపారు. దేవుడి దయ వల్ల తమ అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో పెళ్లి కావడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News February 18, 2025

సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.

News February 18, 2025

బంపర్ ఆఫర్ ఇంకా ఉంది: మస్క్

image

గతంలో వికీపీడియా పేరు మార్పుపై ప్రకటించిన ఆఫర్ ఇప్పటికీ ఉందని మస్క్ ట్వీట్ చేశారు. గతంలో ఆసంస్థ పేరును అసభ్యకరంగా మార్చుకుంటే 1బిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని మస్క్ ప్రకటించారు. అయితే ఒక యూజర్ ఈ ఆఫర్ ఇంకా ఉందా అని అడగగా ‘అవును పేరు మార్చుకుంటే ఉంటుంది’ అని మస్క్ బదులిచ్చారు.

News February 18, 2025

భారత జట్టుకు గుడ్‌న్యూస్

image

ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా గాయపడ్డ భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోలుకున్నారు. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అతను ఎలాంటి కట్టు లేకుండానే పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేశారు. ఫీల్డింగ్ డ్రిల్స్‌కు దూరంగా ఉన్న పంత్ ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 20న భారత్ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 23న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంది.

error: Content is protected !!