News December 23, 2024

బంగారం ఎంత పెరిగిందంటే?

image

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.84 పెరిగి రూ.80,777గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.77 ఎగిసి 74,045 వద్ద కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పెరగడంతో కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 వారాల్లోనే బాగా తగ్గడంతో నేడు స్తబ్ధత నెలకొంది. ఇక వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.91,400 వద్ద చలిస్తోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 పెరిగి రూ.25,500 వద్ద ఉంది.

Similar News

News January 18, 2025

మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్

image

TG: మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని కోరారు. కాగా మోహన్ బాబు కొన్ని రోజులుగా తిరుపతిలో ఉంటుండగా, మంచు మనోజ్ జల్‌పల్లిలోని ఇంట్లో ఉంటున్నారు.

News January 18, 2025

సుచిర్ బాలాజీ మృతిపై స్పందించిన OpenAI

image

సుచిర్ బాలాజీ మృతిపై చాట్ జీపీటీ మాతృసంస్థ OpenAI స్పందించింది. ఇది తమను షాక్‌కు గురి చేసిందని, విలువైన సభ్యుడిని కోల్పోయామని కంపెనీ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. OpenAI ఉద్యోగి అయిన బాలాజీ సంస్థ అనైతిక కార్యకలాపాలపై గతంలో బహిరంగంగా విమర్శలు చేశారు. ఈక్రమంలోనే ఆయన నవంబర్‌లో శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పదంగా మరణించారు. దీంతో తన కొడుకును మర్డర్ చేశారంటూ తాజాగా అతడి తల్లి ఆరోపించారు.

News January 18, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు

image

టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానన్నారు.