News August 5, 2024

కల్తీ పసుపును ఎలా గుర్తించాలి?

image

పసుపును కృత్రిమ రంగులు కలిపి కల్తీ చేస్తుంటారు. దీనిని గుర్తించాలంటే నీటితో నింపిన రెండు గాజు గ్లాసులను తీసుకోవాలి. మీ దగ్గర ఉన్న రెండు రకాల పసుపును వేర్వేరు గ్లాసుల్లో ఒక టీస్పూన్ చొప్పున వేయాలి. కల్తీ జరగని పసుపు వేసిన గ్లాసులో నీళ్లు లేత పసుపు రంగులోకి మారుతాయి. పసుపు అడుగు భాగంలో చేరుతుంది. కల్తీ జరిగిన పసుపు నీటిలో చాలా వరకు కరిగిపోతుంది. నీళ్లు ముదురు పసుపు రంగులోకి మారుతాయి.

Similar News

News December 17, 2025

పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

image

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.

News December 17, 2025

మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

image

మెస్సీ టూర్‌తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్‌కతా‌లో ఫుట్‌బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.

News December 17, 2025

కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

image

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.