News April 7, 2024

TS EAPCETకు భారీగా దరఖాస్తులు

image

TS EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 3.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 21వేల దరఖాస్తులు పెరిగాయి. దీంతో ఇంజినీరింగ్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. EAPCETకు మొత్తంగా ఈసారి 3.60 లక్షల అప్లికేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి ఇప్పటివరకు 57,978 మంది అప్లై చేశారని వెల్లడించారు.

Similar News

News January 26, 2025

అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.

News January 26, 2025

టీ20ల్లో అరుదు

image

SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.

News January 26, 2025

బాలయ్యకు అభినందనల వెల్లువ

image

పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సినీనటులు మహేశ్ బాబు, రాజమౌళి, విజయ్ దేవరకొండ, వెంకటేశ్, అల్లు అరవింద్, వరలక్ష్మీ శరత్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, శ్రీభరత్, కల్వకుంట్ల కవిత, సీఎం రమేశ్, నారా భువనేశ్వరి, అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.