News April 13, 2025

శ్రీశైలం హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

image

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చైత్రపౌర్ణమి సందర్భంగా ఏటా మూడు రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు.

Similar News

News April 23, 2025

IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇవాళ SRHvsMI మ్యాచులో ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనున్నారు. అలాగే మ్యాచుకు ముందు నిమిషం పాటు మౌనం పాటిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. చీర్ లీడర్లు, ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వాహకులు రద్దు చేశారని పేర్కొన్నాయి. ఇవాళ HYD ఉప్పల్ స్టేడియంలో రా.7.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.

News April 23, 2025

‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’

image

బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాకు సంబంధించి ‘All Eyes On Rafah’ అని SMలో ఊదరగొట్టిన బీటౌన్ బడా నటులంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. J&K పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే వారికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే’ అని నిలదీస్తున్నారు.

News April 23, 2025

ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది ఫెయిల్

image

TG: ఇంటర్మీడియట్‌లో ఒక్క మార్కు తేడాతో 1.85లక్షల మంది విద్యార్థులు ఫెయిలైనట్లు బోర్డ్ వర్గాలు తెలిపాయి.. BiPCలో ఓ విద్యార్థినికి అత్యధికంగా 997 మార్కులు రాగా, MPCలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారు. దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివిన ఓ విద్యార్థిని BiPCలో 996 మార్కులు సాధించింది. గురుకుల కళాశాలల్లో 83.17శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మెుత్తంగా 71.37శాతం ఉత్తీర్ణత నమోదైంది.

error: Content is protected !!