News September 27, 2024
కాల్ సెంటర్లు, మ్యారేజీ బ్యూరోల ద్వారా హ్యుమన్ ట్రాఫికింగ్: మంత్రి

AP: రాష్ట్రవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా పెరుగుతోందని హోం మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, మ్యారేజీ బ్యూరోల ముసుగులో ఆన్లైన్ ద్వారా ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. కాల్ సెంటర్లు ద్వారా కూడా విదేశాలకు హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని చెప్పారు. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 27, 2025
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.
News December 27, 2025
తల్లిదండ్రులు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆరునెలలు రాగానే ఘనపదార్థాలు నెమ్మదిగా అలవాటు చెయ్యాలి. అప్పుడే నాలుకకు వ్యాయామం అందుతుందంటున్నారు. అలాగే సిప్పీ కప్పుల వాడకం తగ్గించాలి. దీనివల్ల కూడా మాటలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాటలు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
భారీ జీతంతో AVNLలో ఉద్యోగాలు

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<


