News September 22, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో
తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2024
దేశంలో నోట్ల కొరత తీర్చండి: కాంగ్రెస్
దేశంలో ₹10, ₹20, ₹50 నోట్ల కొరత వల్ల గ్రామీణ భారతం ఇబ్బందులు పడుతోందని, ఈ సమస్యను తీర్చాలంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసింది. UPI, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి RBI ఈ నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో MP మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోదగినదే అయినా వసతులు లేని గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు.
News September 22, 2024
అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదే!
మన వద్ద కూడా అతని దగ్గరున్నటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంట్లో ‘నోకియా 1100’ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా 1110’ (248M), iPhone 6/6+ (222M) ఉన్నాయి.
News September 22, 2024
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు.. మోదీకి జగన్ లేఖ
AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. ‘2014-19లో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. 2019-24లో 18 సార్లు రిజెక్ట్ చేశాం. 2 నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అలాంటప్పుడు లడ్డూల తయారీలో ఈ నెయ్యిని వాడేందుకు వీలులేదు. దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చండి’ అని కోరారు.