News September 24, 2024
భార్యను ఆర్థికంగా ఆదుకొనే బాధ్యత భర్తదే: ఢిల్లీ హైకోర్టు

భార్య సంపాదించగలిగినప్పటికీ, ఆమెను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత భర్తదేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమెను ‘పరాన్నజీవి’ అని పిలవడం ఆమెకే కాకుండా మహిళలందరికీ అగౌరవమే అని వ్యాఖ్యానించింది. భార్యకు భరణం చెల్లించాలన్న కింది కోర్టు ఆదేశాలను భర్త SCలో సవాల్ చేశారు. కేసు విచారణ సందర్భంగా భారతీయ మహిళలు తమ కుటుంబం, పిల్లలు, భర్త-అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొంది.
Similar News
News February 11, 2026
అమెరికా ‘మ్యాప్’ మాయ.. PoK పోస్ట్పై యూటర్న్!

PoK, ఆక్సాయ్ చిన్తో కలిపి మొత్తం J&Kను <<19072627>>భారత భూభాగం<<>>గా చూపిస్తూ చేసిన SM పోస్ట్ను అమెరికా ట్రేడ్ రిప్రజంటేటివ్ (USTR) తొలగించింది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ గతవారం USTR ఈ మ్యాప్ను పోస్ట్ చేసింది. దీంతో పాక్, చైనా ఆక్రమణలను తిరస్కరిస్తూ ఇండియా పొలిటికల్ మ్యాప్ను అమెరికా అధికారికంగా గుర్తించినట్లు అంతా భావించారు.
News February 11, 2026
గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.
News February 11, 2026
ఫీజు రీయింబర్స్మెంట్: కాలేజీల ఖాతాల్లోకే..

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.


