News October 30, 2024
HYD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

యాదాద్రి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలోని అబిద్నగర్లో ఇద్దరు నగరవాసులు మృతి చెందారు. సరదాగా 12 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులు HYD నుంచి స్నేహితుడి ఊరైన మూటకొండూరు మండలం అబిద్నగర్కు వెళ్లారు. ఆ ఊరిలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు శశి, చరణ్ అనే విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు బోడుప్పల్ వాసులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.
Similar News
News December 17, 2025
HYD: ఇరానీ ఛాయ్తో ముస్కురానా!

HYD ఇరానీ ఛాయ్ హోటళ్లు ఇప్పుడు కేవలం చర్చా వేదికలు కావు, నవ్వుల అడ్డాలు! ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన ఈ ఛాయ్ సంస్కృతి ఇప్పుడు హైటెక్స్ నుంచి ఎల్బీనగర్ వరకు కొత్త రూపం దాల్చింది. గ్లాసు ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ కొరుకుతూ యువత పేలుస్తున్న ‘స్టాండప్ కామెడీ’ జోకులతో కెఫెలు దద్దరిల్లుతున్నాయి. ఇటు సంప్రదాయ ఇరానీ టేస్ట్, అటు మోడ్రన్ హ్యూమర్ కలగలిసి హైదరాబాద్ కల్చర్కు అదిరిపోయే గ్లామర్ తెస్తున్నాయి.
News December 17, 2025
RRలో బోణీ కట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్గా వెంకటేశ్

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణి కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News December 17, 2025
హైదరాబాద్లో BJPకి అగ్ని పరీక్ష!

GHMC ఎన్నికల రణరంగంలో BJP ఉనికి ఇప్పుడు ఒక అగ్నిపరీక్షగా మారింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను విస్మరించడం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. నాయకత్వ లేమి, అగ్ర నేతల వర్గపోరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నిర్వీర్యం చేశాయి. 300 కొత్త వార్డుల పునర్విభజన అనే వ్యూహాత్మక చక్రబంధాన్ని ఎదుర్కోవడంలో BJP వెనుకబడింది. తక్షణమే ప్రజా సమస్యలపై పోరాటమే కమలానికి ఏకైక మార్గం.


