News August 12, 2025

HYD: జూపార్క్‌లో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం

image

హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్‌లో నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరిపారు. మూడు ఆడ ఏనుగులను (వనజ, ఆశ, సీత)ను సాధారణ ఎగ్జిబిషన్ ఎన్‌క్లోజర్ నుంచి బయటకు తీసుకొచ్చి, జూలో సుమారు 3 కిలోమీటర్లు నడిపించారు. వనజ, ఆశ, సీత, విజయ్ అనే నాలుగు ఏనుగులకు ప్రత్యేక జంబో విందు వడ్డించారు. పలువురు అధికారులతోపాటు, సందర్శకులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

45 డిగ్రీలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

image

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్‌లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప హీట్ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న APలోని 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 17, 2026

సర్వత్రా ఉత్కంఠ.. సా.4 గంటలకు డీలిమిటేషన్‌పై ఓటింగ్

image

లోక్‌సభలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి డీలిమిటేషన్‌ బిల్లుపై సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యాయి. అటు బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన 360 ఓట్లు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై LSలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు చర్చ జరిగింది.

News April 17, 2026

దక్షిణాది ఇస్తుంది.. ఉత్తరాది ఖర్చు చేస్తుంది: అసదుద్దీన్

image

డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభలో ప్రతిపక్షాల గొంతు మూగబోతుందని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. సౌత్ స్టేట్స్‌పై నార్త్ పెత్తనం చేస్తుంది. దక్షిణాది ఇస్తే ఉత్తరాది ఖర్చు చేస్తుంది. దేశ GDPలో 30%, పన్ను రాబడిలో 21 % సౌత్ నుంచే వస్తోంది. సుపరిపాలన చేసినందుకు ఈ శిక్ష’ అని మండిపడ్డారు.