News March 6, 2025
HYD: మహిళా సదస్సు ఏర్పాట్లపై CS సమీక్ష

పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 8న జరగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై CS శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం మహిళా శక్తి పాలసీ విడుదల చేయనుండగా, మహిళా సమాఖ్యలకు బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సుల పార్కింగ్ కోసం బైసన్పోలో మైదానం సిద్ధం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 6, 2025
నెల్లూరు: హౌసింగ్ AE సస్పెన్షన్

జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
News March 6, 2025
సింగిల్స్లో ‘కింగ్’.. కోహ్లీ

క్రికెట్లో సిక్సులు, ఫోర్ల కంటే ఒక ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లడానికి సింగిల్స్, డబుల్స్ చాలా కీలకం. ఈ విషయంలో కింగ్ కోహ్లీది అందెవేసిన చేయి. విరాట్ 301 వన్డేల్లో 14,180 రన్స్ చేస్తే అందులో సింగిల్స్ ద్వారానే 5,870 పరుగులు వచ్చాయి. 2000 JAN నుంచి ODI క్రికెట్లో ఓ బ్యాటర్కు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర(5,503), జయవర్దనే(4,789), ధోనీ(4,470), పాంటింగ్(3,916), రోహిత్(3,759) ఉన్నారు.
News March 6, 2025
ఆత్మకూరులో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.