News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 17, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈరోజు 21 నామినేషన్లు

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజు 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 12 మంది వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలయ్యాయి. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు వచ్చాయి.

News October 17, 2025

బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.

News October 17, 2025

BREAKING: ఘట్‌‌కేసర్ రైల్వే స్టేషన్‌లో హాష్ ఆయిల్‌తో పట్టుబడ్డ బాలుడు

image

ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో హాష్ ఆయిల్ తీసుకెళుతున్న బాలుడిని మల్కాజిగిరి SOT, ఘట్‌కేసర్ పోలీసులు సంయుక్తంగా ఈరోజు పట్టుకున్నారు. దేబేంద్ర జోడియా శ్రీను అనే వ్యక్తి ఒడిశా నుంచి HYDకు రూ.1.15 కోట్ల విలువైన 5.1 కిలోల హాష్ ఆయిల్‌ను బాలుడితో పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని, పరారీలో ఉన్న దేబేంద్ర కోసం గాలిస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.