News March 16, 2024
HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు.
Similar News
News February 12, 2025
HYD: స్టూడెంట్ మృతి.. శ్రీ చైతన్య ప్రిన్సిపల్పై కేసు (UPDATE)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ కేసులో పాఠశాల ప్రిన్సిపల్ పై కేసు నమోదయింది. ఇదే విషయంపై Way2News ప్రతినిధి మేడ్చల్ ACP బి.శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లైన్లో మాట్లాడారు. విద్యార్థిని తల్లి కమల ఫిర్యాదు మేరకు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
News February 12, 2025
HYD: వేధింపులు.. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని మృతి (UPDATE)

ఫీజు కట్టాలని వేధింపులు తాళలేక మేడ్చల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అఖిల మంగళవారం ఉదయం ఆత్మహత్యకు యత్నించగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అఖిల చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఇదే విషయమై పలువురు పాఠశాల యాజమాన్యం వైఖరిపై మండిపడుతున్నారు.
News February 12, 2025
శామీర్పేట్లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)

శామీర్పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.