News August 26, 2024

హైడ్రా మంచిదే కానీ..: MP కొండా విశ్వేశ్వర్

image

TG: చెరువులు, కుంటలతో పాటు పర్యావరణాన్ని కాపాడే ‘హైడ్రా’ మంచిదేనని BJP MP కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనిపై తాను పెట్టిన ఒపీనియన్ పోల్‌లో 78% హైడ్రాకు మద్దతు వచ్చిందన్నారు. అయితే కేవలం బిల్డర్ల మీదనే కాకుండా ఆ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు వ్యక్తుల నిర్మాణాలే కాకుండా దేవాలయాల భూములు, ప్రభుత్వ భవనాలపైనా దీన్ని అమలు చేయాలన్నారు.

Similar News

News April 11, 2026

టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

image

ఇండియన్ డిజిటల్ పేమెంట్స్‌కు చిరునామాగా మారిన UPIకి నేటితో పదేళ్లు. 2016లో NPCI ప్రారంభించిన ఈ వ్యవస్థ నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా యూజర్లు, 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది వ్యాపారులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా ఫోన్ ద్వారా సులభంగా డబ్బులు పంపేలా UPI మన జీవితాలను మార్చేసింది.

News April 11, 2026

రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

image

ఆర్టెమిస్-2 మిషన్‌లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్‌తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్‌లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్‌గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.

News April 11, 2026

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.