News June 14, 2024

ఐపీఓ ఫైలింగ్‌కు హ్యుందాయ్ రెడీ

image

ఐపీఓను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ నేడు సెబీకి డ్రాఫ్ట్ సమర్పించనుంది. ఈ ఐపీఓతో $3 బిలియన్లు సమకూర్చుకోవాలని, సంస్థ విలువను $20 బిలియన్లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది. 140 నుంచి 150 మిలియన్ షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ప్లాన్స్ సక్సెస్ అయితే ఇది దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.

Similar News

News January 28, 2026

వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.

News January 28, 2026

2023లోనూ ఆ విమానానికి ప్రమాదం!

image

అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి సంచలన విషయం బయటికొచ్చింది. ఇదే విమానం 2023 సెప్టెంబర్‌లోనూ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. VSR వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న Learjet 45 ఎయిర్ క్రాఫ్ట్ విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్ వే నుంచి పక్కకు జారిపోయింది. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం గమనార్హం.

News January 28, 2026

విమాన ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరగాలి: మమతా బెనర్జీ

image

మహారాష్ట్ర బారామతిలో విమానం కుప్పకూలిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.