News February 7, 2025

చేతిరాత మార్చుకోలేకపోయా: మోదీ

image

తన విద్యార్థి దశలో చేతిరాత బాగుండేది కాదని, దానిని మార్చడానికి ఉపాధ్యాయులు చాలా శ్రమించేవారని ప్రధాని మోదీ విద్యార్థులకు తెలిపారు. అయినప్పటికీ చేతిరాత మారలేదన్నారు. ఫిబ్రవరి 10న ‘పరీక్షా పే చర్చ’ జరగనున్ననేపథ్యంలో ఢిల్లీలోని సుందర్ నర్సరీలో విద్యార్థులతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈసారి ‘పరీక్షా పే చర్చా’లో దీపికా పదుకొణే, బాక్సర్ మేరీకోమ్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Similar News

News February 11, 2026

భారత్‌లో తగ్గిన అవినీతి

image

ఇండియాలో అవినీతి తగ్గినట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. కరప్షన్ ఇండెక్స్‌లో 2024లో 182 దేశాల్లోకెల్లా 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకింది. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్‌.. అతితక్కువ అవినీతి ఉన్న దేశాలుగా నిలిచాయి. దక్షిణ సూడాన్, సోమాలియా అత్యంత అవినీతిమయ దేశాలుగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత USలో అవినీతి పెరిగినట్లు తేలింది.

News February 11, 2026

ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

image

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్‌నెస్ ఆధారంగా FEB 15 పాక్‌తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.

News February 11, 2026

తిరుమల కొండపై పూలు ఎందుకు ధరించరు?

image

శ్రీవారు అలంకార ప్రియుడు. కొండపై పూసే ప్రతి పువ్వు స్వామివారికే చెందాలనేది భక్తుల విశ్వాసం. పూర్వం ఓ శిష్యుడు దేవుడికి అర్పించాల్సిన పూలను తాను ధరించాడు. అలా ‘పరిమళ ద్రోహం’ చేసినట్లు పురాణ గాథ. అందుకే, అప్పటి నుంచి భక్తులు కొండపై పూలు పెట్టుకోకూడదనే నియమం వచ్చింది. స్వామికి అలంకరించిన పూలను కూడా ఇతరులకు ఇవ్వకుండా పవిత్రమైన బావిలోనే వేస్తారు. ఈ నియమం పాటించడం స్వామివారిపై ఉన్న భక్తికి నిదర్శనం.