News July 13, 2024
నేను ఆ పోస్టే చేయలేదు: ధ్రువ్ రాఠీ

తనపై <<13622151>>కేసు<<>> నమోదైందని వస్తోన్న వార్తలను యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఖండించారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి పోస్ట్ చేయలేదని, గుర్తు తెలియని వ్యక్తులు తన పేరడి అకౌంట్లో పోస్ట్ చేశారని తెలిపారు. కావాలంటే ఓసారి చెక్ చేయాలని సూచించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు UPSC పరీక్షకు హాజరుకాకుండానే ఉత్తీర్ణత సాధించినట్లు ‘ధ్రువ్ పేరడీ’ X అకౌంట్లో పోస్ట్ చేశారు.
Similar News
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73

ప్రశ్న: యుద్ధంలో ఓడిపోతాం అనే భయంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘మీరు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు’ అని నిందిస్తాడు. అప్పుడు భీష్ముడు 5 బాణాలిచ్చి, వీరితో పంచ పాండవుల ప్రాణాలు తీయవచ్చు అని చెబుతాడు. మరి ఆ బాణాల నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
అక్టోబర్లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

TG: అక్టోబర్లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.
News November 21, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్లెట్ కూడా అందుతుంది. ఆన్లైన్ పేమెంట్తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.


