News March 11, 2025
ఎవరినీ బాధపెట్టాలని కాదు: రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్ మ్యాచుల్లో బౌలర్ కుల్దీప్ యాదవ్పై కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలింగ్ వేశాక కుల్దీప్ స్టంప్స్ వెనక ఉండకపోవడం, త్రో విసిరిన బంతిని పట్టుకోకపోవడంతో వారు సీరియస్ అయ్యారు. ‘ఫీల్డ్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నియంత్రణ కోల్పోతాం. అంతా ఆటలో భాగం. గ్రౌండ్లో అనే మాటలు ఎవరినీ బాధ పెట్టడానికి కాదు’ అని రోహిత్ శర్మ దీనిపై వివరణ ఇచ్చారు.
Similar News
News November 27, 2025
ఆల్టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ 26,295.55 వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు ఎగబాకి 85,799 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 26,251 వద్ద ట్రేడవుతోంది. 2024 సెప్టెంబర్ 27 నాటి రికార్డు గరిష్ఠ స్థాయి 26,277ను అధిగమించింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16%, స్మాల్ క్యాప్ 0.07% పెరిగాయి.
News November 27, 2025
వైకుంఠద్వార దర్శనం.. రిజిస్ట్రేషన్ మొదలు

AP: తిరుమలలో DEC 30 నుంచి JAN 8 వరకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. తొలి 3 రోజులకు నేటి నుంచి DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు. ఈ పవిత్ర దినాల్లో స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు మీరూ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
News November 27, 2025
RITESలో 252 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<


