News February 20, 2025
జగన్ లాంటి నేతను చూడలేదు: CM చంద్రబాబు

AP: ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయాలని మాజీ సీఎం జగన్కు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ లాంటి రాజకీయ నేతను ఇప్పటి వరకు చూడలేదు. ఎన్నికల కోడ్ ఉన్నా ఉల్లంఘించి ఆయన గుంటూరు వెళ్లారు. ఈసీ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు. కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి.. తనకు భద్రత కల్పించలేదని అంటున్నారు. ఈసీ కంటే జగన్ గొప్పవారు కాదు’ అని చంద్రబాబు అన్నారు.
Similar News
News January 11, 2026
సర్వీస్ ఛార్జ్ వేస్తే రెస్టారెంట్లపై ఫిర్యాదు చేయండి

రెస్టారెంట్స్/బార్స్ కస్టమర్కు డీఫాల్ట్గా సర్వీస్ ఛార్జ్తో బిల్ ఇవ్వడం నేరం. వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం.. SCతో బిల్ ఇవ్వడం, మరో పేరుతో ఛార్జ్, తప్పక ఇవ్వాలనడం తదితరాలు చట్ట విరుద్ధం. సేవలు నచ్చి కస్టమర్ స్వతహాగా ఇస్తే తీసుకోవచ్చు కానీ డిమాండ్ చేయకూడదు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ 1915కు ఫిర్యాదు చేస్తే, విచారించి రెస్టారెంట్లకు ₹50K వరకు ఫైన్ విధిస్తుంది.
Share It
News January 11, 2026
T20 WC: బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!

భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 WC మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ <<18761652>>నిరాకరించిన<<>> విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.
News January 11, 2026
ఇతిహాసాలు క్విజ్ – 124 సమాధానం

ప్రశ్న: కురుక్షేత్రంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
సమాధానం: నాగలి ఆయుధం గల బలరాముడికి కౌరవ, పాండవులిద్దరూ సమానులే. అందుకే ఆయనకు యుద్ధం ఇష్టముండదు. ఓవైపు కృష్ణుడు ప్రాతినిధ్యం వహించే పాండవ సేన, మరోవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడి కౌరవ సేన.. ఇద్దరూ బంధువులే కావడంతో ఎవరి పక్షం వహించలేదు. యుద్ధానికి ముందు ఆయుధాలు వదిలి ప్రశాంతత కోసం సరస్వతీ నది తీరం వెంబడి తీర్థయాత్రలకు వెళ్లాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


