News December 16, 2024
‘నా ఫ్రెండ్ సొరోస్ను కలిశాను’.. రచ్చలేపిన థరూర్ పాత ట్వీట్
‘నా పాత ఫ్రెండ్ జార్జ్ సొరోస్ను కలిశాను’ అని 2009లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవ్వడంతో కాంగ్రెస్ MP శశిథరూర్ ఉలిక్కిపడ్డారు. భారత వ్యతిరేకితో మీకేం పనంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో వివరణ ఇచ్చారు. ‘నేను UNలో ఉన్నప్పటి నుంచి ఓ సాధారణ ఫ్రెండ్గా సొరోస్ తెలుసు. అతడు, అతడి సంస్థల నుంచి నేను ఒక్క రూపాయీ తీసుకోలేదు. అతడి ఐడియాలజీకి మద్దతివ్వలేదు. రాజకీయంగా అతడితో అస్సలు సంబంధం లేద’ని చెప్పారు.
Similar News
News January 19, 2025
kg చికెన్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.
News January 19, 2025
WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?
ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్గా శాంసన్ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.
News January 19, 2025
రేషనలైజేషన్ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.