News February 28, 2025

రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తిరస్కరించా: నటి

image

తనకు గతంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయని, వాటిని సున్నితంగా తిరస్కరించానని నటి ప్రీతి జింటా తెలిపారు. సోషల్ మీడియాలో తాను ఏం కామెంట్ చేసినా రాజకీయాలతో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో చేరే ఉద్దేశమేమీ లేదని, వాటిపై ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు. కాగా ఈ సీనియర్ హీరోయిన్ IPLలో పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు.

Similar News

News March 23, 2025

రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

image

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.

News March 23, 2025

విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

image

AP: విశాఖ మేయర్‌పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు)కి చేరింది.

News March 23, 2025

27న పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!