News January 26, 2025
‘దావోస్’ ట్రెండ్ సెట్ చేసింది నేనే: చంద్రబాబు

AP: మన దేశం నుంచి పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్లాలనే ట్రెండ్ సెట్ చేసింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. 1997 నుంచే తాను దావోస్ పర్యటనలకు వెళ్తున్నానని చెప్పారు. ‘90వ దశకంలో ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. అప్పటి నుంచి నేను పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్తుండేవాడిని. నాతోపాటు అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ నాతో పోటీపడేవారు. ఏపీని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చడమే నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
మోదీ బయోపిక్లో హాలీవుడ్ స్టార్.. బడ్జెట్ రూ.400కోట్లు

PM మోదీ బయోపిక్ను ‘మా వందే’ అనే టైటిల్తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పాత్రలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. క్రాంతికుమార్ డైరెక్ట్ చేస్తుండగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై వీర్ రెడ్డి రూ.400కోట్లతో నిర్మిస్తున్నారు. ‘ఆక్వామెన్’ ఫేమ్ జేసన్ మమోవాను ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. JAN 22 నుంచి కశ్మీర్లో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది.
News January 19, 2026
ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్

ఎనిమిది యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి దక్కలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ఆయన లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి ఆలోచించనని, అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. నోబెల్ ఇవ్వకపోవడమే తన దృక్పథం మారడానికి కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ లీక్ కావడంతో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.


