News January 26, 2025

‘దావోస్’ ట్రెండ్ సెట్ చేసింది నేనే: చంద్రబాబు

image

AP: మన దేశం నుంచి పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్లాలనే ట్రెండ్ సెట్ చేసింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. 1997 నుంచే తాను దావోస్ పర్యటనలకు వెళ్తున్నానని చెప్పారు. ‘90వ దశకంలో ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. అప్పటి నుంచి నేను పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్తుండేవాడిని. నాతోపాటు అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ నాతో పోటీపడేవారు. ఏపీని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చడమే నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్

image

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.

News February 11, 2025

రంగరాజన్‌పై దాడిని ఖండించిన చంద్రబాబు

image

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

News February 11, 2025

డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

image

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!