News January 19, 2025
మా అమ్మకు పద్మ అవార్డు కోసం ఎంతో ప్రయత్నించా: నరేశ్

ఇండియాలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలకు పద్మ అవార్డు రాకపోవడంపై కొడుకు నరేశ్ విచారం వ్యక్తం చేశారు. అమ్మకు పురస్కారం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత స్థాయి ఉన్న వ్యక్తులకు అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనూ అలాంటి వారు ఉన్నారని, వారికి పురస్కారాల కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
Similar News
News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
News February 9, 2025
NRIలు, NRTS సభ్యులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.
News February 9, 2025
GBS కలకలం.. రాష్ట్రంలో తొలి మరణం

తెలంగాణలో తొలి GBS(గిలియన్ బార్ సిండ్రోమ్) <<15404745>>మరణం <<>>సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు విడిచింది. సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన వివాహిత(25) నెల రోజుల క్రితం నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నిన్న చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.