News January 20, 2025
ఇక బిగ్ బాస్ హోస్ట్ చేయను: హీరో ప్రకటన

కన్నడ బిగ్ బాస్ షోకు 11 ఏళ్లుగా హోస్ట్గా వ్యవహరిస్తున్న కిచ్చా సుదీప్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హోస్ట్గా తన జర్నీని ఎంజాయ్ చేశానని చెప్పారు. ‘నా శ్రమకు తగ్గ గుర్తింపు రాలేదు అన్పించింది. ఇతర భాషల్లో వచ్చినట్లుగా కన్నడ బిగ్ బాస్కు క్రేజ్ రాలేదు. అందుకే ఇక సినిమాలకే టైమ్ను కేటాయించాలనుకుంటున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News February 7, 2025
ఇకపై ఫోన్లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.
News February 7, 2025
ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కు అలవాటే: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్కు అలవాటే’ అని విమర్శించారు.
News February 7, 2025
విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.