News November 27, 2024
ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి

AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.
Similar News
News February 5, 2026
జీతం కన్నా జీవితం ముఖ్యం!

సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగం పోవడం, లేదంటే పని ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి పని చేయడం తన వల్ల కావట్లేదంటూ HYD మియాపూర్లో నిన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఉద్యోగులు ఒత్తిడికి లోనవకండి. యాజమాన్యం కూడా ఆఫీస్లో మంచి పని వాతావరణాన్ని సృష్టించాలి’ అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
News February 5, 2026
CCRSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

చెన్నైలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ <
News February 5, 2026
తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


