News November 27, 2024

ఎన్ని కేసులు పెట్టినా పారిపోను: చెవిరెడ్డి

image

AP: తనపై కుట్రతోనే <<14711254>>పోక్సో<<>>, ఎస్సీ, ఎస్టీ కేసుల పెట్టారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బెదిరించి, కేసులు పెట్టి పరిపాలన చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడికి పారిపోనని, అందుబాటులోనే ఉంటానని చెప్పారు. తాను తప్పు చేసే వ్యక్తిని కాదని, అరెస్ట్ చేసుకోమని సవాల్ విసిరారు.

Similar News

News March 4, 2026

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో 8 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(అకౌంట్స్, పర్చేజ్ &స్టోర్స్, ఫిజిక్స్), డిప్లొమా, ITI, ఇంటర్, టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 13వరకు పంపాలి. వెబ్‌సైట్: https://csr.res.in/

News March 4, 2026

కల్తీ నెయ్యి నివేదికను సుబ్బారెడ్డి తొక్కిపెట్టారు: పయ్యావుల

image

AP: తిరుమల కల్తీ నెయ్యిపై చర్చ మండలిని కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. CFTRI నివేదిక నెయ్యి కల్తీపై స్పష్టత ఇచ్చినా, దాన్ని YV సుబ్బారెడ్డి తొక్కిపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. YCP హయాంలో TTD నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు మార్చారని ధ్వజమెత్తారు. జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలున్నాయంటూ NDDB రిపోర్ట్ కూడా చెప్పిందని TDP MLC అనురాధ విమర్శించారు.

News March 4, 2026

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $82.66కు చేరింది. అయితే ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా చూస్తామని, అవసరమైతే హార్ముజ్ జలసంధిలో నౌకలకు తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ హామీ ఇవ్వడంతో ధరల పెరుగుదల వేగం తగ్గింది. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 12% పెరిగింది. ఇంధన అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌కు ఇది ఆర్థికంగా భారం కానుంది.