News April 25, 2024

రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించను: కేసీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్ చేయించకపోతే తానే స్వయంగా చేయిస్తానని కేసీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రాజెక్టును బలిపెడితే ఊరుకోమని చెప్పారు. కాళేశ్వరం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందారని చెప్పారు. తన మీద కోపంతో కాంగ్రెస్ నేతలు రైతుల పొలాలు ఎండబెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించనని అన్నారు.

Similar News

News January 13, 2025

మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత

image

AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.

News January 13, 2025

చంద్రబాబు వచ్చాకే ప్రతి ఇంటా సంక్రాంతి ఆనందాలు: టీడీపీ

image

AP: ఐదేళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం చేసి సంక్రాంతి ఆనందం లేకుండా చేశారని టీడీపీ Xలో విమర్శించింది. CBN పాలన ప్రారంభమయ్యాక తొలి సంక్రాంతికే ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని తెలిపింది. జగన్ విధ్వంసంతో ప్రతి రోజూ రాష్ట్రంలో అలజడిగా ఉండేదని, చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనతో రోజూ పండుగలా ఉందని పేర్కొంది. రైతులు, పేదలు, యువత ఎంతో సంతోషంగా ఉన్నారని, ఛార్జీలు పెంచలేదని రాసుకొచ్చింది.

News January 13, 2025

కౌశిక్ రెడ్డి అరెస్ట్ అత్యంత దుర్మార్గం: KTR

image

TG: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ‘ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో BRS ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్‌ను బేషరతుగా విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.