News September 20, 2024
ఆ కేంద్రమంత్రి తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే

TG: రాహుల్ గాంధీ నంబర్ వన్ ఉగ్రవాది అంటూ కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు చేసిన ఆరోపణలపై ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. బిట్టు తల నరికి తెచ్చినవారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమిని రాసిస్తానని ప్రకటించారు. బిట్టుపై బీజేపీ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు బిట్టుపై కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో బెంగళూరులో కేసు నమోదైంది.
Similar News
News April 5, 2026
షిన్రిన్-యోకు: స్ట్రెస్ను దూరం చేసే జపనీస్ టెక్నిక్

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కామన్ అయిపోయిన స్ట్రెస్ను దూరం చేసుకునేందుకు జపాన్ వాసులు ‘షిన్రిన్-యోకు’ అనే సహజ ప్రక్రియను అనుసరిస్తున్నారు. షిన్రిన్-యోకు అంటే ప్రకృతి ఒడిలో నిమగ్నమవ్వడం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, మట్టి వాసనలను ఆస్వాదిస్తూ గడపడమే ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇలా ప్రకృతితో మమేకమైతే మానసిక ఆందోళనలు దూరమై శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని జపాన్ వాసుల విశ్వాసం.
News April 5, 2026
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

*వివేక్ ఎక్స్ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్సాగర్ ఎక్స్ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.
News April 5, 2026
హిమంత క్షమాపణ కోరినా వదిలేది లేదు: రాహుల్

దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన CM హిమంత అని INC అగ్రనేత రాహుల్ విమర్శించారు. ఆయన క్షమాపణ కోరినా వదలబోమని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ మరణానికి బాధ్యులైన వారితో CMకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి హిమంత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


