News December 29, 2024
ICC అవార్డు.. నామినేట్ అయింది వీరే!
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం ఐసీసీ నలుగురిని నామినేట్ చేసింది. అందులో భారత్ నుంచి అర్ష్దీప్ సింగ్, ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, జింబాబ్వే నుంచి సికందర్ రజాకు చోటు దక్కింది. ఈ నలుగురిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వస్తుంది. ఓటు వేసేందుకు ఇక్కడ <
Similar News
News January 26, 2025
వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ
గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.
News January 26, 2025
వన్డే క్రికెట్లో కోహ్లీ మకుటం లేని మహారాజు: కైఫ్
టెస్టుల్లో పేలవ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పుంజుకుంటారని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ మకుటం లేని మహారాజు. ఆయనెప్పుడూ ఓటమిని అంగీకరించరు. ఇప్పటికే వన్డేల్లో 50 సెంచరీలు, 13వేల పరుగులు చేశారు. తెల్లబంతిపై ఆయన ఆట వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన శకం ఇంకా ముగిసిపోలేదు’ అని పేర్కొన్నారు.
News January 26, 2025
నేటి ముఖ్యాంశాలు
* 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
* హైదరాబాద్ తెలుగు వారందరిది: ఏపీ సీఎం చంద్రబాబు
* జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR
* రేపు తెలంగాణలో 4 కొత్త పథకాలు ప్రారంభం
* ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి
* ఇంగ్లండ్పై రెండో టీ20లో భారత్ విజయం