News November 14, 2024

IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

image

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్‌ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్‌లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News November 20, 2025

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

image

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

News November 20, 2025

‘జనజీవన స్రవంతి’ అంటే ఏంటంటే?

image

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు అనే వార్తలు వింటుంటాం. ‘జనజీవన స్రవంతి’ అంటే సమాజంలో శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవించడం. మావోయిస్టులు హింస, ఆయుధాలు & రహస్య జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ పౌరులుగా మారారని అర్థం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్య, ఉద్యోగం వంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇది సూచిస్తుంది.

News November 20, 2025

పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

image

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.