News November 14, 2024
IND, PAK హక్కుల్ని ICC రద్దు చేయాలి: పాక్ మాజీ కెప్టెన్

భారత్, పాకిస్థాన్ బోర్డులకు ఉన్న టోర్నీల హోస్టింగ్ హక్కుల్ని ఐసీసీ రద్దు చేయాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించారు. భేదాలు సెట్ అయ్యేవరకూ హోస్టింగ్ను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ‘2023-2031 మధ్యకాలంలో పాక్లో రెండు ఈవెంట్లు, INDలో 5 ఈవెంట్లు ఉన్నాయి. ఆ నిర్వహణ హక్కులన్నింటినీ ఐసీసీ వేరే దేశాలకు తరలించాలి. అప్పుడే సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News October 20, 2025
ఇదేం ఆట.. టీమ్ ఇండియాపై ఫ్యాన్స్ ఫైర్

వరల్డ్ కప్-2025: ఇంగ్లండ్పై భారత మహిళల టీమ్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 30 బంతుల్లో 36 రన్స్ చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయని, అయినా గెలవలేకపోయిందని మండిపడుతున్నారు. ఇలాంటి ఆటతీరుతో భారత్ WC నెగ్గడం కష్టమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా గత 3 మ్యాచుల్లో భారత్ పరాజయం పాలైంది. దీంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. అటు AUS, దక్షిణాఫ్రికా, ENG సెమీస్ చేరాయి.
News October 20, 2025
చంద్రబాబూ.. మీది ఏ రాక్షస జాతి: YCP

AP: 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపీడించాడని CM చంద్రబాబు చేసిన <<18052970>>వ్యాఖ్యలపై<<>> YCP మండిపడింది. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏ రకం రాక్షస జాతికి చెందిన వారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు 2004, 2009లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారు. 2019లోనూ మట్టికరిపించారు. అసలు మీరు CM పీఠంలోకి వచ్చిందే.. NTR గారిని వెనక నుంచి పొడిచి. ఇది ఏ రాక్షసజాతి లక్షణం అంటారు’ అని ట్వీట్ చేసింది.
News October 19, 2025
WWC: ఉత్కంఠ పోరులో భారత జట్టు ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 284/6 రన్స్కు పరిమితమైంది. స్మృతి మంధాన 88, హర్మన్ ప్రీత్ 70, దీప్తి శర్మ 50 రన్స్తో రాణించారు. సులభంగా గెలిచే అవకాశాలున్నా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి, బౌండరీలు బాదకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.