News September 30, 2024
బుమ్రా IPL వేలంలోకి వస్తే?: హర్భజన్
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా IPL వేలంలోకి వస్తే టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలుస్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ అన్నారు. దీనితో మీరు ఏకీభవిస్తారా? అని తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ముంబై జట్టులో ఉన్న బుమ్రాకు రూ.12కోట్లు వస్తున్నాయి. వచ్చే సీజన్కు ఆయన ముంబైతోనే ఉంటారా? ఉంటే వచ్చే ప్రైస్ ఎంత? లేదా ఆక్షన్లోకి వస్తారా? అనేది రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక తెలుస్తుంది.
Similar News
News September 30, 2024
బ్లాక్బస్టర్ సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది!
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘12th ఫెయిల్’కు ప్రీక్వెల్ రాబోతోంది. IIFA 2024 ఈవెంట్లో చిత్రనిర్మాత విధు వినోద్ చోప్రా ఈ విషయాన్ని చెప్పారు. ‘జీరో సే షురువాత్’ అనే టైటిల్తో ఈ చిత్రం రాబోతున్నట్లు పేర్కొన్నారు. నటీనటుల్లో ఎలాంటి మార్పు ఉండదని, డిసెంబర్ 13న విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘12th ఫెయిల్’ చిత్రంలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్లు జంటగా నటించారు.
News September 30, 2024
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్
AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.