News December 20, 2024
ఇది అప్పుడే తెలిస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేది: అశ్విన్

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తనకు వచ్చిన కాల్స్ స్క్రీన్షాట్ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేశారు. ‘25 ఏళ్ల క్రితం ఎవరైనా నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందని, భారత క్రికెటర్గా నా కెరీర్ చివరి రోజు కాల్ లాగ్ ఇలా ఉంటుందని చెబితే, నాకు గుండెపోటు వచ్చి ఉండేది’ అని ఆయన ట్వీట్ చేశారు. సచిన్, కపిల్ దేవ్ లాంటి గొప్ప క్రికెటర్ల నుంచి కాల్ రావడం ఆశీర్వాదం అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. మరో 3 రోజులే ఛాన్స్!

ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు JAN 5తో దరఖాస్తు గడువు ముగియనుంది. మూడు విభాగాల్లో ఉన్న ఈ పోస్టులకు ఎంపికైన వారికి స్థాయిని బట్టి నెలకు రూ.90K-1.2L శాలరీ వస్తుంది. పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, 35-40సం. మధ్య వయస్కులు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం BOI <
News January 2, 2026
కృష్ణా జలాలపై ఎవరి దారి వారిదే

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం, BRS ఎవరి దారి వారిదే అన్నట్లు మారింది. దీనిపై అసెంబ్లీలో చర్చకు INC సిద్ధమవగా సభను బహిష్కరిస్తున్నట్లు విపక్షం ప్రకటించింది. కాగా రేపు TG భవన్లో ఈ అంశంపై MLAలతో సమావేశమై PPT ప్రజెంటేషన్ ఇవ్వాలని BRS నిర్ణయించింది. GOVT మాత్రం సభలో దీనిపై చర్చ గురించి ఇంకా తేల్చలేదు. చర్చించినా CPI, MIM సానుకూలమే. కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న BJP తటస్థంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
News January 2, 2026
బంగ్లాలో పర్యటించనున్న టీమ్ ఇండియా!

భారత జట్టు ఈ ఏడాది SEPలో బంగ్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పోస్ట్పోన్ అయిన పర్యటనను రీషెడ్యూల్ చేసినట్లు BCB క్రికెట్ ఆపరేషన్స్ ఇన్-ఛార్జ్ తెలిపినట్లు క్రిక్బజ్ పేర్కొంది. ‘ఆగస్టు 28న టీమ్ ఇండియా బంగ్లాదేశ్ చేరుకుంటుంది. SEP 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, 9, 12, 13వ తేదీల్లో T20లు ఆడుతుంది’ అని తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.


