News December 23, 2024

నేను చెబితే చంద్రబాబు చెప్పినట్లే: ఆదోని MLA

image

AP: ఆదోని నియోజకవర్గంలో గత పదేళ్లు సర్వం తామే అని వ్యవహరించిన వైసీపీ కార్యకర్తలకు 5 నెలల సమయం ఇచ్చామని, ఇక చాలని MLA పార్థసారథి అన్నారు. ఆదోనిలో లబ్ధి చేకూరే ఏ ఒక్క పనిలోనూ వైసీపీ కార్యకర్త ఉండటానికి వీల్లేదన్నారు. తాను చెబితే చంద్రబాబు, పవన్ చెప్పినట్లేనని, మర్యాదగా వదిలిపోండని హెచ్చరించారు. తమను ఆపే శక్తి ఈ రాష్ట్రంలో రాబోయే 25 ఏళ్ల వరకు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.

Similar News

News January 14, 2025

అథ్లెట్‌పై అత్యాచారం.. 44 మంది అరెస్ట్

image

కేరళలో ఓ అథ్లెట్ బాలిక(18)పై ఐదేళ్లుగా 62 మంది కామాంధుల <<15126560>>లైంగిక వేధింపుల<<>> కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 44 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మృగాళ్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిందితులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

News January 14, 2025

గంభీర్ కోచ్ పదవికి ఎసరు?

image

త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శనపైనే హెడ్ కోచ్ గంభీర్ పదవీకాలం పొడిగింపు ఆధారపడి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. CT తర్వాత BCCI రివ్యూ నిర్వహించి నిర్ణయం తీసుకోనుందట. అందులోనూ భారత్ విఫలమైతే గంభీర్‌ను కోచ్‌గా తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గతేడాది జులైలో గౌతీ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ ఇండియా 10 టెస్టుల్లో 6 ఓడిపోయింది. BGT సందర్భంగా చెలరేగిన వివాదాలు తెలిసినవే.

News January 14, 2025

మోదీని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు: రాహుల్

image

ఢిల్లీలో అవినీతి, ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నా ప్ర‌ధాని మోదీ త‌ర‌హాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబ‌ద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. ఆప్‌పై శాయ‌శ‌క్తులా పోరాడాల‌ని, వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపాల‌ని, అధికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌న్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.