News December 9, 2024
రోహిత్ ఓపెనర్గా వచ్చి ఉంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733689860864_782-normal-WIFI.webp)
అడిలైడ్ టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నా, ఓపెనింగ్ చేయలేదు. ఆ స్థానాన్ని రాహుల్కు ఇచ్చారు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ తొలి ఇన్సింగ్స్లో 3పరుగులు, రెండో ఇన్సింగ్స్లో 6పరుగులు చేసి ఔటయ్యారు. ఎప్పటి లాగే ఓపెనింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News January 21, 2025
12 గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737067932025_1226-normal-WIFI.webp)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో 12 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఎస్వీసీ, మైత్రీ, వృద్ధి సినిమాస్లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. మొత్తం 8 చోట్ల 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన తమ్ముడు శిరీష్, కుమార్తె నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు.
News January 21, 2025
IOC ప్రెసిడెంట్తో ICC ఛైర్మన్ జై షా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737456713788_1032-normal-WIFI.webp)
ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్తో ఐసీసీ ఛైర్మన్ జై షా న్యూజిలాండ్లో మరోసారి సమావేశమయ్యారు. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లోనే క్రికెట్ను చేర్చాలని జై షా పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ఇటీవల ఆస్ట్రేలియాలోనూ 2032 బ్రిస్బేన్ ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్తో జై షా భేటీ అయ్యారు.
News January 21, 2025
‘నా భార్య టార్చర్ పెడుతోంది.. చనిపోతున్నా’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737463824159_367-normal-WIFI.webp)
భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. ఇండోర్(MP)కు చెందిన నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకున్నా తన భార్య హర్ష, అత్త, భార్య సోదరీమణులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. ‘మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. వాటిని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని తెలిపాడు. యువకులు పెళ్లి చేసుకోవద్దని, ఒకవేళ చేసుకుంటే ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని పేర్కొన్నాడు.