News January 11, 2025
రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..

ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్లు), సచిన్ (276 ఇన్నింగ్స్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.
Similar News
News October 22, 2025
భారీ వర్షసూచన.. మరో 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: రాయలసీమతో పాటు పలు జిల్లాలకు వాతావరణశాఖ రేపు భారీ వర్షసూచన చేసింది. ఈ నేపథ్యంలో మరో 2 జిల్లాల స్కూళ్లకు సెలవులిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కడప డీఈవో శంషుద్దీన్, అన్నమయ్య డీఈవో సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ GNT, కృష్ణా, చిత్తూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
News October 22, 2025
‘సిరిని తెచ్చే సింహ ద్వారం ఎంతో ముఖ్యం’

సింహ ద్వారం వాస్తు నియమాల ప్రకారం ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. మనిషికి ముఖం ఎలాగో ఇంటికి సింహద్వారం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ‘సింహద్వారం ఇంటి దిక్కుకు అభిముఖంగా, మధ్యభాగంలో ఉండాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండాలి. సింహద్వారం ఇంటికి అందంతో పాటు అదృష్టాన్ని తెస్తుంది. సింహ ద్వారం విషయంలో నిర్లక్ష్యం వద్దు’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>
News October 22, 2025
నవీన్, సునీత నామినేషన్లకు ఆమోదం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. తన నామినేషన్పై బీఆర్ఎస్ తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని నవీన్ తెలిపారు. అన్నీ సక్రమంగా ఉండటంతో ఆర్వో ఆమోదించినట్లు చెప్పారు. తాను మాత్రం ఎవరి నామినేషన్పై అభ్యంతరం చేయలేదని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి మరింత సమయం పట్టనుంది.